📰

గాయపడిచికిత్సపొందుతున్న పికిలి బాయిని పరామర్శిస్తూన ఎమ్మెల్యే
మండలంలోని తుమ్మకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మొగవత్ పికిలిబాయి ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమా దంలో గాయాలపాలై నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పార్టీ నేతల సమాచారం ఇవ్వడంతో నరసరావుపేటలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న పికిలిబాయిని ఎమ్మెల్యే జాలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాయవరం జంక్షన్ లో రోడ్డు పక్కన నిలబడి వున్న సమయంలో బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయని పేర్కొంది. ధైర్యంగా ఉండాలని చెప్పడంతో పాటు వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ గిరిజన నేత మంగ్లానాయక్ తదితరులున్నారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense