
రేపు యధావిధిగాప్రజా సమస్యల పరిష్కారం వేదిక. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
నరసరావుపేట:ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం సోమవారం (జూలై 20) జిల్లా కలెక్టరేట్తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్, సచివాలయ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించి వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు అన్ని కేంద్రాల్లో కొత్తగా 'ఫీడ్బ్యాక్ క్యూఆర్ (QR) కోడ్'ను అందుబాటులోకి తెచ్చామని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యాలయాలకు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, *meekosam.ap.gov.in* వెబ్సైట్ లేదా వాట్సప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 (దీని ద్వారా 300కు పైగా సేవలు లభ్యం) ద్వారా కూడా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense