
వ్యవసాయ శాఖ ఏడీఏకి సమ్మె నోటీసు అందిస్తున్న ఎంపీఈవోలు
జీతాలు పెంచాలని, శాశ్వితంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులివ్వాలని, ప్రమాద బీమా క ల్పించాలని, మహిళా ఉద్యోగినులకు చైల్డ్ కేర్ లీప్స్ మంజూరు చేయాలని కోరుతూ మల్టీపర్పస్ ఎక్స్టెటెన్షన్ ఆఫీసర్లు మంగళవారం నుంచి పెన్ డౌ న్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ మేరకు మాచర్ల ఏడీఏ జగదీశ్వరరెడ్డికి రాతపూర్వకంగా అభ్యర్ధనను అందించారు. ఈసందర్భంగా యూనియన్ నేత ఆ నిల్ మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి చాలీ చాలని వేతనంతో బాధ్యతలు నిర్వహిస్తున్నామని అయినా తమ జీవితాల్లో ఎలాంటి పురోగతి లే దని వేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాంబాబునాయక్,ఆంజినాయ క్; లింగానాయక్,పి.రామారావు తదితరులు పాల్గొన్నారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense