
ఎన్నికల తీరుపై విద్యార్థుల్లో అవగాహన
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రెంటచింతల మండల కేంద్రంలోని ఫాతిమా విద్యానికేతన్లో శనివారం మాక్ పోలింగ్ నిర్వహిం ! చారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ ఏర్పాటు, ఓటర్ల జాబితా పరిశీలన, ఎడమ చేతికి సిరా గుర్తు వేయడం, ఓటరు స్లిప్పుల ; పంపిణీ, ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ సిబ్బంది విధులు, బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, విజేతలు బాధ్యతలు చేపట్టే విధానం తదితర అంశాలను విద్యార్థులే ప్రత్యక్షంగా నిర్వహించి ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించుకున్నారు. ఓటింగ్ ప్రక్రియలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. కార్యక్రమంలో విద్యాసంస్థ కరస్పాండెంట్ ఏరువ ఫాతిమా మర్రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు స్టెఫీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense