పీఆర్సీనీ వెంటనే నియమించాలి, యూటిఎఫ్, ఎస్టియూ నేతలు

పీఆర్సీనీ వెంటనే నియమించాలి, యూటిఎఫ్, ఎస్టియూ నేతలు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 03 Aug 2026 RMB

పీఆర్సీనీ వెంటనే నియమించాలి, యూటిఎఫ్, ఎస్టియూ నేతలు

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

(రెంటచింతల),,రాష్ట్ర ప్రభుత్వం 12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని వెంటనే నియమించా లని యూటీఎఫ్, ఎస్టీయూ నేతలు కోరారు. ఆదివారం రెంటచింతలలోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పీఆర్సీ ఏర్పాటుతో పాటు పెండింగ్లో ఉన్న డీఏలను విడు దల చేయాలని ఉద్యోగులందరికి సీపీఎస్ రద్దు చేసి ఓపీఎ లను అమలు చేయాలని కోరారు. ఇప్పటికే ఎంతో కాలయా పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ కు చెందిన డాక్టర్ చిన్నమ్మ, నాసరయ్య, ఎస్టీయూ జిల్లా కౌన్సిలర్లు అమలబాబు, లేళ్ల శ్రీనివాసరావు, సిలార్ తదితరులు పాల్గొన్నారు.

📢 Advertisement Space - Google AdSense
డ్యాం ను పరిశీలిస్తున్న, సీ ఈ, తిరుమల ప్రసాద్
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

డ్యాం ను పరిశీలిస్తున్న, సీ ఈ, తిరుమల ప్రసాద్

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

వర్షాకాలం ప్రారంభమైనందున ఎగువన వున్న నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటిక ప్పుడు అంచనా వేసుకుంటూ విద్యుత్ను తయారు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఏపీజెన్కో చీఫ్ ఇంజనీర్ తిరుమల ప్రసాద్ ఇంజనీరింగ్ సి బ్బందిని ఆదేశించారు. గురువారం సత్రశాలలోని కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టును సాధారణ తనిఖీల్లో భాగంగా సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. క్రస్ట్ గేట్లు, రిజర్వాయర్లో వున్న నీటి నిల్వ,మెయిన్ డ్యాం, పవర్ హౌస్లోని టర్తైయిన్లను తనిఖీ చేశారు. ఎస్ఈ ,కె. వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు,ఈఈ, గోదావరి శ్రీనివాస్, ఏడీఈలు అబ్దుల్ మతిన్, జయశంకర్, నిరంజన్, మల్లేష్, కోటేశ్వరరావు, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు

📢 Advertisement Space - Google AdSense