ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారి గండిగుండం వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. ఘటనపై విశాఖపట్నం జిల్లా అధికారులను అడిగి హోం మంత్రి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.