ఏసీబీ వలలో వెహికల్ ఇన్స్పెక్టర్.. రూ.2.48 లక్షలు స్వాధీనం!
నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద వాహనదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై వెహికల్ ఇన్స్పెక్టర్ గోపినాయక్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన వద్ద నుంచి రూ.2.48 లక్షల నగదు, కారును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
🕐 06 Sep 2026 | 07:02 PM
📰 Read More