రెంటచింతలలో వెలవెలబోతున్న బీసీ సంక్షేమ హాస్టళ్లు
ఒకప్పుడు ప్రముఖులు చదువుకున్న రెంటచింతల మండల కేంద్రంలోని ఐదు బీసీ బాలుర, బాలికల వసతి గృహాలు ప్రస్తుతం విద్యార్థులు లేక ఖాళీగా మారుతున్నాయి.గతంలో ఇక్కడ సీటు కోసం సిఫార్సులు అవసరమయ్యేంత డిమాండ్ ఉండేది. మాజీ ఎస్పీ చాంద్ నాయక్ లాంటి ఎందరో ప్రముఖులు ఇక్కడే చదువుకున్నారు, 1990లో గురజాల మాజీ ఎమ్మెల్యే దివంగత కాయితీ వెంకట నర్సిరెడ్డి ప్రత్యేక చొరవతో, అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి సహాయంతో ఈ హాస్టళ్లను ఏర్పాటు చేశారు.
🕐 05 Sep 2026 | 09:32 PM
📰 Read More