ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన!
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించారు. 12వ పీఆర్సీ ఏర్పాటుకు అంగీకరించడంతో పాటు 2026 అక్టోబర్ 1 నుంచి రెండు డీఏలు చెల్లించనున్నారు. 2022 సరెండర్ లీవ్ బకాయిలను వచ్చే సంక్రాంతికి జమ చేయాలని నిర్ణయించారు. పోలీసులకు అదనపు సరెండర్ లీవ్ను దసరాకు చెల్లించనున్నారు. 2027 జనవరి నుంచి అదనపు పెన్షన్ అమలు, ఈహెచ్ఎస్ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ నిర్ణయాలతో ఏటా సుమారు రూ.2,880 కోట్ల అదనపు వ్యయం కానుంది.
🕐 05 Sep 2026 | 07:09 PM
📰 Read More