
వైసీపీలో రాజీనామా కలకలం!
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి కొనసాగుతోంది. బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు తన పదవికి, రాజకీయాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా సమావేశంలో పార్టీ అధినేత ఫొటో ఎదుటే ఈ నిర్ణయాన్ని వెల్లడించిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కోసం పనిచేసినా ఆశించిన గుర్తింపు, గౌరవం లభించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
📰 Read More