వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి
పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం తన సొంత గ్రామమైన కండ్లకుంటలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన వినాయక స్వామి వారి విగ్రహాన్ని ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ, జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
🕐 14 Sep 2026 | 01:38 PM
📰 Read More