ముసాయిదా ఓటర్ల జాబితా పై నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ
: గతనెల 31న విడుదల చేసిన ఓటర్ల జాబితా ముసాయిదాలో అభ్యంతరాలుంటే నేటి నుంచి బీఎల్ఏలే ఆర్జీలను స్వీకరించనున్నట్లు తహశీల్దార్ మర్రి దీప్తి చెప్పారు. బుధవారం ఆమె మాట్లాడుతూ 13 రకాల ప్రభుత్వ గుర్తింపుకార్డుల్లో ఏదొఒకటి చూపించి ఓటర్లను నిర్ధారించుకోవడానికి అవకాశం ఉందన్నారు. సర్.లోభాగంగా మండల వ్యాప్తంగా వివరాలు లేని 4000 ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని ప్రస్తుతం 36064 మంది ఓటర్లున్నారన్నారు.