మల్లవరంలో తాగునీటి ఎద్దడి: మోటార్ రిపేర్ చేయిస్తామని ఎంపీడీవో, హామీ
మండల పరిధిలోని మల్లవరం గ్రామం ఎస్సీ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. తాగడానికి నీరు దొరక్క కాలనీవాసులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై మదర్ ఫౌండేషన్ మల్లవరంఅధ్యక్షుడు జిల్లా బాబు రావు ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎంపీడీవో, స్వరూప రాణి కి రాతపూర్వకంగా వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో. గ్రామంలో పాడైపోయిన బోర్ త్రీ ఫేస్ మోటార్ను తక్షణమే రిపేర్ చేయించి, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా సాగర్, కిషోర్, బాబు, ఏసోబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు