
ED: భూదాన్ స్కామ్లో ఈడీ విచారణకు ఐఏఎస్
భూదాన్ స్కామ్లో పొలిటికల్ లింకులు.. ధరణి రిజిస్ట్రేషన్ల అక్రమాలపై దర్యాప్తు

భూదాన్ స్కామ్లో పొలిటికల్ లింకులు.. ధరణి రిజిస్ట్రేషన్ల అక్రమాలపై దర్యాప్తు

హైదరాబాద్ లో యువకుడి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (సోమవారం) వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం పరివాహక ప్రాంతాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రధాన జిల్లాలే కాకుండా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

నరసరావుపేట:ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం సోమవారం (జూలై 20) జిల్లా కలెక్టరేట్తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్, సచివాలయ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించి వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు అన్ని కేంద్రాల్లో కొత్తగా 'ఫీడ్బ్యాక్ క్యూఆర్ (QR) కోడ్'ను అందుబాటులోకి తెచ్చామని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యాలయాలకు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, *meekosam.ap.gov.in* వెబ్సైట్ లేదా వాట్సప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 (దీని ద్వారా 300కు పైగా సేవలు లభ్యం) ద్వారా కూడా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా సంస్కరణలతో విద్యార్థులు జీవితా ల్లో వెలుగు ప్రసరిస్తుందని ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని టీడీపీ రెంటచింతల టౌన్ అధ్యక్షులు ఎం. రాజారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన రెంటచింతలలోని ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహంలో ఉండే స్టూడెంట్స్ కు దుప్పట్లు, ప్లేట్లు, స్వెట్టర్స్, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వార్డెన్లు బేగ్, అరుణుమారిలు అధ్యక్షత వహించార . గురజాల ఏఎస్ డబ్ల్యువో టీవీ.సుజాత కుమారి మాట్లాడుతూ రెండు రోజుల్లో ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో తల్లికి వందనం నగదు జమౌతుందని చదువుకే వాడుకోవాలని నొక్కి చెప్పారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలన్నారు..ఈ కార్యక్రమంలో పీ హెచ్సీ చూజీ చైర్మన్ బి.రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రెంటచింతల, ఆర్ అండ్ బి రహదారిని ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారులకు అలాగే మైక్ పెట్టి రణగొణధ్వనులు సృష్టించే వారికి ఎస్ఐ సీహెచ్ నాగార్జున తనదైన శైలిలో సుతిమెత్తంగా హెచ్చరించారు.రహ దారికివీరువైపులా ఏర్పాటు చేసిన సిమెంట్ బ్రిక్స్ దాటి వస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అదే పనిగా చిన్న స్పీకర్ల తో ధ్వని కాలుష్యం చేస్తే వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్కు అంతరాయడం కలిగించొద్దన్నారు. రహదారి విస్తరించడం వల్ల ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోవాలే కాని ఇష్టారాజ్యంగా ట్రాఫిక్కు పండ్ల బళ్లను అడ్డుపెడితే ఊరు కునేది లేదన్నారు.

ఆజాద్ పార్టీ జహీరాబాద్ కాంసెన్సీ సీనియర్ నాయకుడు సిద్దు రావ ణ్. జహీరాబాద్ మండల్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి జులై 19
ఆజాద్ పార్టీ కన్వీనర్ గా అధ్యక్షుడిగా నియమితులైన సిద్దు రామన్ గారు

హిందూ మతం విడిచి క్రైస్తవం లేదా ఇతర మతాలు స్వీకరించిన వ్యక్తులకు రాజ్యాంగపరమైన ఎస్సీ (SC) హోదా వర్తించదని సుప్రీంకోర్టు తాజాగా తేల్చిచెప్పింది.
ఏపీలోని బాపట్ల జిల్లాలో 2021లో జరిగిన ఒక దాడి కేసుకు సంబంధించి చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదుదారుడు క్రైస్తవ మతం స్వీకరించినందున అతనికి ఈ చట్టం వర్తించదని గతంలో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పులో ఎలాంటి లోపాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. మతం మారిన తర్వాత ఎస్సీ హోదా, అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందే అవకాశం ఉండదని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది.

జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన గెలుపుపై స్పందించింది.

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారి గండిగుండం వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. ఘటనపై విశాఖపట్నం జిల్లా అధికారులను అడిగి హోం మంత్రి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను వినుకొండ ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ కుటుంబసభ్యులు, బంధువులుగా పోలీసులు గుర్తించారు.ఘటనలో చంద్రశేఖర్కు తీవ్రగాయాలు కాగా.. ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో చంద్రశేఖర్ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. బాధితులంతా గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆనందపురం పోలీసులకు సమాచారం అందించారు.

వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని ఎవరైనా విక్రయించాలని అనుకున్నప్పుడు వారు తొలుత సహ వారసులకు ప్రాధాన్యం ఇచ్చి అమ్మాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్ 22 ప్రకారం ‘క్లాస్-1 చట్టబద్ధ వారసుల’కు ప్రాధాన్యం ఇచ్చి, వారు కొనుగోలు చేస్తారేమోనని అడగాల్సి ఉంటుందని తెలిపింది. వారు కాదన్నప్పుడే బయటవారికి విక్రయించుకోవచ్చని తెలిపింది. క్లాస్-1 వారసులకు ప్రాధాన్యత పొందే హక్కు ఉంటుందని పేర్కొంది. క్లాస్-1 వారసుల్లో మరణించిన వ్యక్తి జీవితభాగస్వామి, పిల్లలు, తల్లి ఉంటారు. ఎలాంటి వీలునామా రాయని సందర్భంలో వారసత్వ ఆస్తిని పొందే తొలి హక్కు వారికి ఉంటుంది. 22వ సెక్షన్ స్థిరాస్తు లు, వ్యాపారాలకు వర్తిస్తుంది.

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా జాతీయ జెండాతో కప్పబడిన శవపేటికల పైన ట్రంప్ కుటుంబ సభ్యుల చిత్రాలను ముద్రించిన ఈ బ్యానర్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు స్థానికులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్గా అధికారులు గుర్తించారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, వారికి తక్షణమే అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

vcbvcbvcb

vcbvcbvcb

vcbvcbvcb

బీహారీ డెకాయిట్ అని ఇంతకాలం విమర్శించిన ప్రశాంత్ కిషోర్తో తాజాగా చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని CNN న్యూస్ 18 తెలుగు రాష్ట్రాల ప్రతినిధి రిషిక తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీ సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దేశవ్యాప్తంగా సంబరాలు.

కృత్రిమ మేధస్సు సాంకేతికత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. పంటల పర్యవేక్షణ, నీటి నిర్వహణ, కీటకాల గుర్తింపు వంటి పనులు ఏఐ ద్వారా సులభంగా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.