
ప్రకాశం:ఆన్లైన్ స్కీమ్పై బాధితుల ఆరోపణలు!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ ఆన్లైన్ పెట్టుబడి ప్లాట్ఫామ్ ద్వారా పలువురు మోసపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలో లాభాలు చెల్లించి నమ్మకం కల్పించిన నిర్వాహకులు, తర్వాత డబ్బుల ఉపసంహరణ నిలిపివేశారని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖాతా యాక్టివ్ చేయాలంటే మరో రూ.7 వేలు చెల్లించాలని యాప్లో సందేశాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు సంస్థ విశ్వసనీయతను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
📰 Read More