
ప్రేమ పేరుతో దారుణం,, యువతని హత్య చేసి దాహనం చేసిన ప్రియుడు
కారంపూడి శివారులో యువతి షేక్ హసీనా (25) హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన సంచలనం రేపింది. ప్రాథమిక దర్యాప్తులో, ఐదేళ్ల ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన అనుమానాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. చిలకలూరిపేటకు చెందిన హసీనాను కారంపూడికి పిలిపించి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిలుగు బాల సైదులును చిలకలూరిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు
📰 Read More