ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి ఎస్సై పరమేష్
చింతలపాలెం పోలీస్ స్టేషన్ లో గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్సై పరమేష్ సమావేశం నిర్వహించారు. మండపాల ఏర్పాటు ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణం లో నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ నిర్వాహకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
🕐 09 Sep 2026 | 06:29 PM
📰 Read More