
ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (సోమవారం) వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం పరివాహక ప్రాంతాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రధాన జిల్లాలే కాకుండా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense