Generating...

🔐 Admin Login

పేదింటి బిడ్డల పెద్దదిక్కు శాంతి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రామన్
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 20 Jul 2026 RMB

పేదింటి బిడ్డల పెద్దదిక్కు శాంతి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రామన్

👤 RMB Reporter | 📍 సంగారెడ్డి, తెలంగాణ | 🕐 11:15 AM

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం చింతలగట్టు గ్రామంలో శాంతి ఫౌండేషన్; ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ మరియు శాంతి ఫౌండేషన్ చైర్మన్ అయిన సిద్దు రావణ్.. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని దర్గా, చర్చి, పోచమ్మ దేవాలయాలను సందర్శించి సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచారు. మన ఊరు - మన బిడ్డ అనే కార్యక్రమంలో భాగంగా, తన తల్లి శాంతమ్మ గారి జ్ఞాపకార్థం సిద్దు రావణ్ ఈ కార్యక్రమాలను చేపట్టారు. కోల్పోయిన దాని విలువ పోగొట్టుకున్న వారికే తెలుస్తుందని, కన్నతల్లి ఆశయాలను నెరవేర్చడమే నిజమైన విజయం అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. దానం చేసే చేతులే సమాజానికి నిజమైన సంపద అని పేర్కొంటూ.. గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందజేశారు. డప్పుల దరువులు, కళాకారుల ఆటపాటలతో గ్రామంలోని అన్ని కులాలను ఏకం చేస్తూ ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విద్యాసాగర్, ఉప సర్పంచ్ ఖలీల్ భాషా, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు కలిసి సిద్దు రావణ్ గారిని ఘనంగా సన్మానించారు.

📰 Read More
📢 Advertisement Space - Google AdSense
📰 1 / 1