బిగ్ బ్రేకింగ్ - తాజా వార్తలు

కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల, బాలకృష్ణుడు వేషధారణలు: శ్రీరామకృష్ణ గురుకులం చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో చేసిన కోలాటం, కృష్ణలీలలు పురవీధుల్లో అందరినీ ఆకట్టుకున్నాయి.స్వామివారి ఊరేగింపు: దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.ఉత్కంఠభరిత ఉట్లు: శ్రీరామకృష్ణా సేవా మండలి నేతృత్వంలో ఉష్ణస్తంభాల సెంటర్లో నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ఎంతో ఆసక్తిగా సాగింది. శ్రీకృష్ణాదేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు భారీగా అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రూ.40 లక్షల నిధులు మంజూరు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రూ.40 లక్షల నిధులు మంజూరు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మంచికల్లు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ రూ.40 లక్షలు మంజూరు చేసింది ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి దేవాదాయ శాఖకు 25 సెంట్ల స్థలాన్ని అప్పగించాల్సి ఉంటుంది . పశువేముల, బోదిలవీడు, పట్లవీడు గ్రామాల్లోని బీసీ, ఎస్టీ కాలనీల్లో కూడా స్థల సేకరణను బట్టి మరికొన్ని ఆలయాల నిర్మాణానికి నిధులు కేటాయించారు

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల,: మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు విధుల్లో చేరినట్లు ఎంఈవో-2 శివ నాగేశ్వరరావు చెప్పారు. మొత్తం 6 ఎస్జీటీ 7 గురు స్కూల్ అసిస్టెంట్లు ఉద్యోగాల్లో చేరారని ఆయన తెలిపారు. అయితే, మల్లవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో హిందీ పోస్టుకు ఎవరూ ఎంపిక కాకపోవడం వల్ల, ఆ పోస్టు భర్తీ అనేది డీఈవో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

7వ తేదీన పల్లె ఓటర్ల జాబితా
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

7వ తేదీన పల్లె ఓటర్ల జాబితా

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. ఈనెల 3వ తేదీ నుంచి చేపట్టిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు 6వ తేదీ వరకు నిర్వహించి ఎటువంటి అ భ్యంతరాలు లేవని నిర్ణయించాల్సి వుందని ఎంపీడీవో స్వరూపరాణి చెప్పారు. గ్రామ సభల ద్వారా ఓటర్ల తుది జాబితా ను 7వ తేదీన ఆయా గ్రామ సచివాలయాల నందు విడుదల చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. సర్ ప్రక్రియ చేపట్టక ముందు మండలంలోని 11 గ్రామాల్లో, 40674 మంది ఓటర్లున్నారన్నారు

నూతన ఓటరు నమోదుకు నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

నూతన ఓటరు నమోదుకు నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహశీల్దార్ మర్రి దీప్తి పిలుపునిచ్చారు.ప్రత్యేక శిబిరాలు: మండల వ్యాప్తంగా సెప్టెంబరు 4, 5 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు.కొత్త ఓటరు నమోదు: అర్హులు ఆయా పోలింగ్ కేంద్రాల్లోని బీఎల్వోల (BLO) వద్ద ఫారం-6 ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు.

వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే తనయుడు, గౌతమ్ రెడ్డి
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే తనయుడు, గౌతమ్ రెడ్డి

| 🌐 Telugu | 📍 వెల్దుర్తి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

గొట్టిపాళ్ళ గ్రామంలో రాజబోయిన చిన్న మారకొండయ్య కుమారుడు శివ మారకొండయ్య వివాహ వేడుక లో పాల్గొన్న.ముఖ్య అతిథులు:జూలకంటి గౌతం రెడ్డి రాజబోయిన మధు యాదవ్ (మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్)కళ్ళం రామంజి రెడ్డి మరియు ఇతర అధికారులు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

రెంటచింతలలో గోకులాల నిర్మాణానికి భూమి పూజ
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

రెంటచింతలలో గోకులాల నిర్మాణానికి భూమి పూజ

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

: కూటమి ప్రభుత్వ 'పల్లె పండుగ 3.0' లో భాగంగా పశువుల షెడ్ల (గోకులాలు) నిర్మాణానికి భూమి పూజ చేశారు.బడ్జెట్ , సబ్సిడీ: రైతురూ,20,000 చెల్లిస్తే, ప్రభుత్వం రూ,1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. మండల మొత్తానికి 18 గోకులాలు మంజూరయ్యాయి. రెంటచింతల, తుమ్మలకోటకు 3 చొప్పున.. జెట్టిపాలెం, గోలి మినహా మిగిలిన గ్రామాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు.ముఖ్య అతిథులు: టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్ అబిరెడ్డి, సీనియర్ నాయకుడు గొట్టు సుమంత్ రెడ్డి,ఎంపీడీవో స్వరూపరాణి అధికారులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా సవరణ(SIR)
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా సవరణ(SIR)

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను తహశీల్దార్ ఎం. దీప్తి మాట్లాడుతూ:క్లెయిములు, అభ్యంతరాల గడువు: ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు.అభ్యంతరాల పరిష్కారం: అక్టోబరు 5 లోగా పూర్తి చేస్తారు.తుది ఓటర్ల జాబితా విడుదల: అక్టోబరు 9న అధికారికంగా ప్రకటిస్తారు.అర్హులైన ఓటర్లందరూ గడువు లోగా తమ వివరాలను పరిశీలించుకోవాలని కోరారు

పవన్ కళ్యాణ్‌పై శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

పవన్ కళ్యాణ్‌పై శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న వేళ, ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్‌లోని మానవత్వం, ఆపన్నుల పట్ల ఆయన చూపించే ప్రేమను గుర్తుచేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్‌డమ్‌కు అతీతంగా ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని ఈ పోస్ట్ ఆవిష్కరిస్తోంది.

తిరుమల డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

తిరుమల డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు

| 🌐 Telugu | 📍 Tirupathi, ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో ACB సోదాలు కలకలం రేపుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పెద్దకాపు లేఅవుట్‌లోని ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
ACB DSP శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. ఒకేసారి మొత్తం ఐదు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో తిరుపతిలోని లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లతో పాటు తిరుమలలోని ఆయన కార్యాలయం కూడా ఉన్నట్లు తెలుస

దర్శి వైన్స్ షాప్‌లో భారీ గోల్‌మాల్!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

దర్శి వైన్స్ షాప్‌లో భారీ గోల్‌మాల్!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

దర్శి ఫ్రెండ్స్ వైన్స్ షాప్‌లో రూ.20 లక్షలకు పైగా ఆర్థిక అవకతవకలు జరిగినట్లు యజమాని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సూపర్‌వైజర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్శి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎంత మొత్తం నష్టం జరిగింది? ఆరోపణల్లో నిజమెంత? పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం తెలియాల్సి ఉంది.

మదర్ ఫౌండేషన్ మల్లవరం అధ్యక్షులుకి సోదరులు రాఖీ
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

మదర్ ఫౌండేషన్ మల్లవరం అధ్యక్షులుకి సోదరులు రాఖీ

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండలపరిధిలోని మల్లవరం గ్రామంలోపవిత్ర రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మదరఫౌండేషన్ మల్లవరం అధ్యక్షుడు జిల్లా బాబురావువారి సోదరులు ప్రేమతో రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆయనకు మిఠాయిలు తినిపించి, భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న తన సోదరుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలపడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు మ్యాక్స్ వాహనం ఎదురెదురుగా ఢీ,, 8గాయాలు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఆర్టీసీ బస్సు మ్యాక్స్ వాహనం ఎదురెదురుగా ఢీ,, 8గాయాలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు చెందిన ఆర్టీసీ బస్సు గుంటూరు నుంచి కల్వకుర్తికి వెళ్తున్న పెళ్ళి బస్సు ఎదురుగా వస్తున్న మ్యాక్సీ వాహనాన్ని పాలువాయి జంక్షన్ సమీపంలోని సర్వీస్ రోడ్డు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఢీకొనగా 8 మంది వ్యక్తులు గాయపడ్డారు. నూతన బస్సు డ్రైవర్‌కు అవగాహన లేక సర్వీస్ రోడ్డునే జాతీయ రహదారిగా భావించి డ్రైవ్ చేయడం ఈ ప్రమాదం జరగడానికి కారణం. గాయపడిన వారంతా ఎస్సీ కాలనీల్లో సోలార్ పలకలు ఏర్పాటు చేసే టెక్నీషియన్లు.. నాగరాజుతో పాటు మరో వ్యక్తిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత

చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం

| 🌐 Telugu | 📍 Chilakaluripet, ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుట్టినరోజు వేడుకల నుంచి స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ఈ విషాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#Palnadu #RoadAccident #Chilakalurip

ప్రేమ కథకు మరో విషాద ముగింపు!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ప్రేమ కథకు మరో విషాద ముగింపు!

| 🌐 Telugu | 📍 సంగారెడ్డి, సంగారెడ్డి, తెలంగాణ

సంగారెడ్డి: కుటుంబ విభేదాల కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో ప్రేమ వ్యవహారానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిపై దాడి చేసి మరణానికి కారణమైన కేసులో ఆమె అరెస్టయ్యింది. ఇటీవల విడుదలైన అనంతరం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

ఉత్తమ డిటి అవార్డును పొందిన వెంకటరమణ ను సన్మానిస్తున్న వీఆర్వోలు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఉత్తమ డిటి అవార్డును పొందిన వెంకటరమణ ను సన్మానిస్తున్న వీఆర్వోలు

| 🌐 English | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

విధి నిర్వహణే ప్రతిభకు గీటురాయని అంకితభావంతో పనిచేస్తే అవార్డులు వాటంతట అవే లభిస్తాయని తహశీల్దార్ మర్రి దీప్తి అన్నారు. ఉత్తమ ఉద్యోగి అవార్డును కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్న డిప్యూటీ తహశీల్దార్ వెంకట రమణ గౌరవార్థం మండల వీఆర్వోల సంఘం అధ్యక్షులు పల్లా రామకృష్ణ నేతృత్వంలో పాపారావు, విఘ్నేష్ , శంకర్ రెడ్డి, అరుణ, అశోక్, రెవెన్యూ కార్యాలయంలో దుశ్శాలవతో ఘనంగాసత్కరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

విశాఖలో స్కూల్‌లో విషాద ఘటన.. విద్యార్థి మృతి
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

విశాఖలో స్కూల్‌లో విషాద ఘటన.. విద్యార్థి మృతి

| 🌐 Telugu | 📍 Vizag, Vizag, ఆంధ్రప్రదేశ్

విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో విషాదం చోటుచేసుకుంది. హోమ్‌వర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో LKG విద్యార్థి ప్రణయ్ తేజ్‌ (6) తీవ్ర భయాందోళనకు గురై తరగతి గదిలోనే కుప్పకూలాడు. వెంటనే కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడి మృతికి కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దుర్గి లో డ్రంక్ అండ్ డ్రైవ్,,రూ.10వేలు జరిమానా
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

దుర్గి లో డ్రంక్ అండ్ డ్రైవ్,,రూ.10వేలు జరిమానా

| 🌐 English | 📍 దుర్గి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

దుర్గి లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన పట్రా శ్రీకాంత్ బాబుకు మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి రూ.10 వేల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా దుర్గి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నిందితుడు పట్టుబడ్డాడు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ బి.గోపాల్ హెచ్చరించారు.

ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన జాతీయ పథకం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన జాతీయ పథకం

| 🌐 Telugu | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన జాతీయ పతాకం
జహీరాబాద్, ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి, ఆగస్టు 15: జహీరాబాద్ ఇరిగేషన్ కార్యాలయంలో 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ విజయ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల అనంతరం సాధించుకున్న స్వాతంత్ర దేశ సార్వభౌమాత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగ

1947 ఆగస్టు 15.. స్వాతంత్ర్య భారత తొలి ఉదయం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

1947 ఆగస్టు 15.. స్వాతంత్ర్య భారత తొలి ఉదయం

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

🇮🇳 1947 ఆగస్టు 15.. భారత చరిత్రలో మరచిపోలేని తొలి స్వాతంత్ర్య ఉదయం. ఢిల్లీలో లక్షలాది మంది ఉత్సాహంగా వేడుకలు వీక్షించారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగిరిన క్షణం దేశ ప్రజల్లో కొత్త ఆశలు నింపింది. ఆనందంతో పాటు విభజన విషాదం వెంటాడినా.. ఆ రోజు స్వేచ్ఛ, ఆత్మగౌరవానికి చిరస్థాయి గుర్తుగా నిలిచింది. #IndependenceDay #India1947

ஸ்டான்லி மருத்துவமனையில் அதிர்ச்சி... வெளியான காட்சி!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ஸ்டான்லி மருத்துவமனையில் அதிர்ச்சி... வெளியான காட்சி!

| 🌐 Tamil | 📍 తమిళనాడు

விளக்கம்: சென்னை ஸ்டான்லி அரசு மருத்துவமனையில் நோயாளிகளுக்கான வேகவைத்த முட்டைகள் சரியான முறையில் வழங்கப்படாமல், படுக்கைகளின் அருகில் வைக்கப்பட்டதாகக் கூறப்படும் வீடியோ சமூக வலைதளங்களில் வேகமாக பரவி வருகிறது. இந்த விவகாரம் கவனத்திற்கு வந்ததைத் தொடர்ந்து, சம்பவத்தின் உண்மை நிலையை அறிய சுகாதாரத் துறை அதிகாரிகள் விசாரணையை தொடங்கியுள்ளனர்.

‘Hi’ మెసేజ్.. రూ.5 లక్షల హెల్త్ కవర్!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

‘Hi’ మెసేజ్.. రూ.5 లక్షల హెల్త్ కవర్!

| 🌐 Telugu | 📍 ఢిల్లీ

ఆయుష్మాన్ భారత్ PM-JAY పథకం కింద అర్హత ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆసుపత్రి చికిత్సకు ఆరోగ్య కవరేజీ లభిస్తుంది. ఈ పథకంలో నగదు రహిత వైద్యం అందించే సదుపాయం ఉంది. అయితే ‘రూ.5 లక్షల ఇన్సూరెన్స్’ అందరికీ ఆటోమేటిక్‌గా వర్తించదు.. అర్హత తప్పనిసరి. దీనికోసం ‘ఆయుష్మాన్ సారథి’ మొబైల్ నంబర్ +91 72908 23838కు వాట్సాప్‌లో ‘Hi’ లేదా ‘Hello’ అని మెసేజ్ చేయండి.

వర్షాలపై భారీ అలర్ట్!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

వర్షాలపై భారీ అలర్ట్!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

అమరావతికి బిగ్ బూస్ట్!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

అమరావతికి బిగ్ బూస్ట్!

| 🌐 Telugu | 📍 అమరావతి, అమరావతి, ఆంధ్రప్రదేశ్

అమరావతిని ఆధునిక సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడులు, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త అవకాశాలు, స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగనుంది.

ముసాయిదా ఓటర్ల జాబితా పై నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ముసాయిదా ఓటర్ల జాబితా పై నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

: గతనెల 31న విడుదల చేసిన ఓటర్ల జాబితా ముసాయిదాలో అభ్యంతరాలుంటే నేటి నుంచి బీఎల్ఏలే ఆర్జీలను స్వీకరించనున్నట్లు తహశీల్దార్ మర్రి దీప్తి చెప్పారు. బుధవారం ఆమె మాట్లాడుతూ 13 రకాల ప్రభుత్వ గుర్తింపుకార్డుల్లో ఏదొఒకటి చూపించి ఓటర్లను నిర్ధారించుకోవడానికి అవకాశం ఉందన్నారు. సర్.లోభాగంగా మండల వ్యాప్తంగా వివరాలు లేని 4000 ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని ప్రస్తుతం 36064 మంది ఓటర్లున్నారన్నారు.

జహీరాబాద్ ఘనంగా నవోదయ సిద్ధార్థ్ జన్మదిన వేడుకలు నియోజవర్గ
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

జహీరాబాద్ ఘనంగా నవోదయ సిద్ధార్థ్ జన్మదిన వేడుకలు నియోజవర్గ

| 🌐 Telugu | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

జహీరాబాద్‌ ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 12 నవోదయ సిద్ధార్థ జన్మదిన వేడుకలు, నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్లే గారు, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ నవోదయ సిద్ధార్థ జన్మదిన వేడుకలు మంగళవారం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి.ఆయన స్వగ్రామం అయినా చిక్కుర్తి గ్రామం, న్యాల్కల్ మండలం నుండి యువత అందరు కలిసి ఆయన పుట్టినరోజున నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో నవోదయ సిద్ధార్థ మాట్లాడుతూ.

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ధనుష్‌పై.. విజ‌య్‌ సర్కారు నిఘా

| 🌐 Telugu | 📍 Chennai, తమిళనాడు

హీరో ధనుష్ (Dhanush) చర్యలపై విజ‌య్ టీవీకే (TVK)ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర నిఘా వర్గాలు అందించిన నివేదికతో అప్రమత్తమైన సర్కారు ధనుష్, ఆయన అభిమాన సంఘాలు చేపట్టే సంక్షేమ, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై దృష్టి సారించింది. ప్రభుత్వానికి నిఘా వర్గాలు అందించిన నివేదిక మేరకు.. హీరో ధనుష్ యువతను లక్ష్యంగా చేసుకుని, ఆయన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదుకు టికే కోవై జిల్లాలోని పది నిజయోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రారంబించారు.

రైలు కింద పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

రైలు కింద పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల, : శుక్రవారం మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న రైలు కింద సాయంత్రం నా లుగున్నర గంటల సమయంలో పడ్డ వ్యక్తి గురజాల మండలం జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన షేక్ ఈసోబగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఈసోబు ఎడమ చేయి పూర్తిగా విరిగిపోయి రైలు పట్టాల మధ్యన ప డిపోయింది. గురజాల రైల్వే స్టేషన్ వచ్చిందనుకుని రెంటచింతలలో దిగుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఈసోబును 108లో గురజాల ప్రభుత్వాసుపత్రికి అక్కడ నుంచి నరసరావుపేటకు తర లించారు.

అరాచకాలకు భద్రత కావాలా?.. అమిత్ షాను వేడుకున్న వైసీపీ!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

అరాచకాలకు భద్రత కావాలా?.. అమిత్ షాను వేడుకున్న వైసీపీ!

| 🌐 Telugu | 📍 ఢిల్లీ

ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతకు ముప్పు పొంచి ఉందంటూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకప్పుడు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రత్యర్థులపై పెద్దఎత్తున అరాచకాలు, వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆ పార్టీ నేతలే, ఇప్పుడు రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

ప్రకాశం:ఆన్‌లైన్ స్కీమ్‌పై బాధితుల ఆరోపణలు!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ప్రకాశం:ఆన్‌లైన్ స్కీమ్‌పై బాధితుల ఆరోపణలు!

| 🌐 Telugu | 📍 Ongole, Prakasam, ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ ఆన్‌లైన్ పెట్టుబడి ప్లాట్‌ఫామ్ ద్వారా పలువురు మోసపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలో లాభాలు చెల్లించి నమ్మకం కల్పించిన నిర్వాహకులు, తర్వాత డబ్బుల ఉపసంహరణ నిలిపివేశారని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖాతా యాక్టివ్ చేయాలంటే మరో రూ.7 వేలు చెల్లించాలని యాప్‌లో సందేశాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు సంస్థ విశ్వసనీయతను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

వైసీపీలో రాజీనామా కలకలం!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

వైసీపీలో రాజీనామా కలకలం!

| 🌐 Telugu | 📍 నెల్లూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి కొనసాగుతోంది. బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు తన పదవికి, రాజకీయాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా సమావేశంలో పార్టీ అధినేత ఫొటో ఎదుటే ఈ నిర్ణయాన్ని వెల్లడించిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కోసం పనిచేసినా ఆశించిన గుర్తింపు, గౌరవం లభించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రూ.13 వేలకు ఇదే లాస్ట్ డేట్!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

రూ.13 వేలకు ఇదే లాస్ట్ డేట్!

| 🌐 Telugu | 📍 AP, AP, ఆంధ్రప్రదేశ్

AP: తల్లికి వందనం పథకంలో ఇంకా సాయం అందని అర్హులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అభ్యంతరాలు, ఫిర్యాదులు నమోదు చేసేందుకు ఇచ్చిన గడువును ఈ నెల 7 వరకు పొడిగించింది. అర్హుల జాబితాలో పేరు లేకపోయినా లేదా ఇతర సమస్యలు ఉన్నా గ్రామ/వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతా NPCIతో లింక్ అయి ఉందో లేదో సరిచూసుకోవాలని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అర్హుల ఖాతాల్లో సాయం జమ చేయనున్నట్లు వెల్లడించారు.

ఇండిగో బంపర్ ఆఫర్... ఫ్రీ టికెట్లు!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఇండిగో బంపర్ ఆఫర్... ఫ్రీ టికెట్లు!

| 🌐 Telugu | 📍 Delhi, Delhi, ఢిల్లీ

20 ఏళ్ల కార్యకలాపాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండిగో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 6 మధ్య సంస్థ అధికారిక బుకింగ్ ఛానెళ్ల ద్వారా దేశీయ విమాన టికెట్లు బుక్ చేసిన అర్హులైన ప్రయాణికుల్లో ఎంపికైన వారికి మొత్తం 20,000 ఉచిత టికెట్లను అందించనుంది. అలాగే నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠంగా రూ.10,000 వరకు టికెట్ మొత్తాన్ని రీఫండ్ చేసే అవకాశం కూడా కల్పించినట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాలకు వర్షాల అలర్ట్
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

తెలుగు రాష్ట్రాలకు వర్షాల అలర్ట్

| 🌐 Telugu | 📍 TS-AP, TS-AP, ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటల్లో వాతావరణంలో మార్పులు కనిపించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) సూచిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు, ప్రయాణికులు స్థానిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అద్దంకిలో వేల ఉద్యోగాలకు బాట!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

అద్దంకిలో వేల ఉద్యోగాలకు బాట!

| 🌐 Telugu | 📍 Addanki, Prakasam, ఆంధ్రప్రదేశ్

అద్దంకిలో REMZకు వేగం
అద్దంకిలో రెన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. భూములు ఇచ్చిన రైతులకు రూ.31.57 కోట్ల పరిహారం చెల్లించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తైతే స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

నేడు నాగార్జునసాగర్ జలాశయం ప్రారంభ దినోత్సవం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

నేడు నాగార్జునసాగర్ జలాశయం ప్రారంభ దినోత్సవం

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లాలో 1967 ఆగస్టు 4న కృష్ణా నదిపై నిర్మించిన దేశంలోని అతిపెద్ద బహుళార్థక సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన నాగార్జునసాగర్ ఆనకట్టను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు, అనేక ప్రాంతాలకు తాగునీరు అందడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తికీ విశేషంగా దోహదపడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది

వర్గ పోరుకు దూరంగా ఉండండి, డీఎస్పీ, బి మహేశ్వరరావు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

వర్గ పోరుకు దూరంగా ఉండండి, డీఎస్పీ, బి మహేశ్వరరావు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

వర్గపోరుకు దూరంగా ఉండాలని గురజాల డీఎస్పీ బీ.మహేశ్వరరావు కోరారు. మండ లంలోని తుమ్మకోట లో పర్యటించి గ్రామస్తు లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్ని
కల్లో ఎవరు ఓటు వారు వేసుకోవాలని అశాం తిని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. చెప్పుడు మాటలు విని జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. కారం పూడి సీఐ ఆవుల భాస్కర్,ఎస్ఐ సీహెచ్ నాగా ర్జున తదితరులున్నారు.

కారంపూడి, నూతన సీఐ,ను సన్మానిస్తున్న మండల టిడిపి నేతలు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

కారంపూడి, నూతన సీఐ,ను సన్మానిస్తున్న మండల టిడిపి నేతలు

| 🌐 Telugu | 📍 కారంపూడి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానని గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన అనుభవం
తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని కారంపూడి నూతన సీఐ, ఆవుల భాస్కర్ ఆన్నారు. మండల టీడీపీ అధ్యక్షులు అబ్బిరెడ్డినేతృత్వంలో పలువు రు నేతులు ఆదివారం నూతన సీఐ, భాస్కర్ ను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పెండింగ్ కేసుల ప రిష్కారానికి కృషి చేస్తానని మండలంలోని ప్రతి గామాన్ని సందర్శించి లా అండ్ ఆర్డర్ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను అవగతం చేసుకుని పరి ష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీన

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై లోకేష్ హైలైట్!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై లోకేష్ హైలైట్!

| 🌐 Telugu | 📍 Vizag, Vizag, ఆంధ్రప్రదేశ్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ విమానాశ్రయం ప్రాంతానికి కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. మెరుగైన రవాణా అనుసంధానంతో పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రను రాష్ట్ర అభివృద్ధిలో కీలక వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం వల్ల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్

ముసాయిదా ఓటర్ల జాబితాలో 36 0 64 మంది ఓటర్లు,, తహశీల్దార్
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ముసాయిదా ఓటర్ల జాబితాలో 36 0 64 మంది ఓటర్లు,, తహశీల్దార్

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం ముగియడంతో శు క్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను తహశీల్దార్ మర్రి దీప్తి విడుదల చేశారు. ఆగస్టు 30 వరకు ఓటర్ల చేర్పులకు అవకాశం ఉందన్నారు. అభ్యంతరాలను బీఎల్వోలు స్వీకరించి సెప్టెంబర్ 28 లోపు పరిష్కరిస్తామన్నారు ఆక్టోబరు 3 వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. ఇప్పటి దాకా రెంటచింతల మండలంలోని 11 గ్రామాలు,132 వార్డులు,50 పోలింగ్ బూత్లకు సంబంధించి 40674 మంది ఓటర్లుండగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య 36.064 మంది వున్నారు. డబుల్ ఎంట్రీ,

డ్యాం ను పరిశీలిస్తున్న, సీ ఈ, తిరుమల ప్రసాద్
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

డ్యాం ను పరిశీలిస్తున్న, సీ ఈ, తిరుమల ప్రసాద్

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

వర్షాకాలం ప్రారంభమైనందున ఎగువన వున్న నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటిక ప్పుడు అంచనా వేసుకుంటూ విద్యుత్ను తయారు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఏపీజెన్కో చీఫ్ ఇంజనీర్ తిరుమల ప్రసాద్ ఇంజనీరింగ్ సి బ్బందిని ఆదేశించారు. గురువారం సత్రశాలలోని కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టును సాధారణ తనిఖీల్లో భాగంగా సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. క్రస్ట్ గేట్లు, రిజర్వాయర్లో వున్న నీటి నిల్వ,మెయిన్ డ్యాం, పవర్ హౌస్లోని టర్తైయిన్లను తనిఖీ చేశారు. ఎస్ఈ ,కె. వెంకట

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారుల విస్తృత సోదాలు

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు (CBI Raids) నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌సీఎస్ షుగర్స్ లిమిటెడ్ కంపెనీతో పాటు డైరెక్టర్లకు సంబంధించిన పలు ప్రాంతాల్లోని ఆస్తులపై సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం తీర్చుకొని ఎన్సీఎస్ కంపెనీ నిర్వాహకులు ఎగ్గొట్టినట్లు అధికారులు తెలిపారు.

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం!

| 🌐 Telugu | 📍 Vizag, ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో రవాణా, పర్యాటకం, ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

సూట్‌కేస్‌లో యువతి మృతదేహం

| 🌐 Telugu | 📍 Vizag, Vizag, ఆంధ్రప్రదేశ్

విశాఖలో కలకలం సృష్టించిన యువతి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశాలోని రాయగడ వద్ద సూట్‌కేసులో లభ్యమైన మృతదేహాన్ని విశాఖకు చెందిన యువతి సంధ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఒడిశా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

శుక్రవారం ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో దర్శి నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్డీవో విజయ జ్యోతి తదితర అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సాధ్యమైన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. కార్యక్రమానికి సహకరించిన గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్, ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి

గోమాత ఒకే కాన్పులో రెండు కోడెదూడలకి జన్మనిచ్చిన
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

గోమాత ఒకే కాన్పులో రెండు కోడెదూడలకి జన్మనిచ్చిన

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల, మండలంలోని రెంటాల గ్రామ రైతు సింగు వెంకయ్యకు చెందిన గోమాత
ఒకే కాన్పులో రెండు కోడేదూడలకు జన్మనిచ్చి అందర్ని అబ్బురపరిచింది. ఈఘటన గ్రామంలో అందరికి తెలియడడం తో గ్రామస్తులంతా ఆ లేగ దూడలను చూసేందకు క్యూ కట్టారు. అనంతరం గోమాతకు మహిళలు ప్రత్యేక పూజలు చే శారు. ఇటీవలి కాలంలో అరుదైన సంఘటన జరగడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పశువైద్యాధికారులు డా క్టర్ దీపక్ నాగార్జున, సహాయకులు భాస్కర్, రమేష్ నాయక్ గోమాత సుఖమయ ప్రసవానికి దగ్గరుండి ప్రత్యేక వైద్యం అందించారు.

వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం

| 🌐 Telugu | 📍 Kadapa, ఆంధ్రప్రదేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెదనాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు ఆనంద్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ రేపు పులివెందులకు వెళ్లనున్నట్లు వైసీపీ నేతలు వెల్లడించారు.

దర్శి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

దర్శి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

రేపు ముండ్లమూరులో భారీ స్థాయిలో ‘మీకోసం’ గ్రీవెన్స్ కార్యక్రమం జరగనుంది!జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు!
మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశం!

ఏపీలో వర్షాలు.. 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఏపీలో వర్షాలు.. 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు!

| 🌐 Telugu | 📍 Amaravathi, AP, ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో వాతావరణం మారే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఏపీలో వర్షాభావ పరిస్థితులు.. ఖరీఫ్‌పై ప్రభావం

| 🌐 Telugu | 📍 AP, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో ఖరీఫ్ సాగుపై ఆందోళన నెలకొంది.

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఏపీలో భారీ వర్షాలకు అవకాశం

| 🌐 Telugu | 📍 AP, AP, ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ముత్యాలమ్మ గ్రామ దేవతకు బోనాల సమర్పిస్తున్న భక్తులు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ముత్యాలమ్మ గ్రామ దేవతకు బోనాల సమర్పిస్తున్న భక్తులు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

: తొలి ఏకాదశి పర్వదినం ముగిసిన తరువాత ఆషాఢ మాసాన్ని పురస్కరిం
చుకుని ఆదివారం గ్రామ దేవత ముత్యాలమ్మకు సారే సమర్పించారు. మేజర్ పంచాయతీ రెంటచింతల ఆంజనేయస్వా మి మాణ్యానికి చెందిన భక్తులంతా ఎర్రటి ఎండలో తల్లికి బోనాలు సమర్పించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.ము ఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి చీర, సారె, పసుపు, కుంకుమ అందించారు. కరువు దరి చేరకూ డదని పాడి పంటలతో గ్రామాలు తులతూగాలని వరుణ దేవుడు కరుణించాలని వేడుకున్నారు. చల్లంగ దీవించాలని క రుణ కటాక్షాలు కుమ్మరించాలని ప్రార్ధించారు. పూజా

పంటలకు బీమా చేయించుకోవాలి..ఏవో కట్టా లక్ష్మారెడ్డి
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

పంటలకు బీమా చేయించుకోవాలి..ఏవో కట్టా లక్ష్మారెడ్డి

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల...ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు సంభవించి పంటలు నష్టపోయే అవకాశం ఉన్నందున బోర్ల కింద వరి సాగు చేస్తున్న రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని నమోదు చేసుకోవాలని ఏవో కట్టా లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం సాగు పరిస్థితులపై మాట్లాడుతూ బ్యాంక్. నుండి పంట రుణం తీసుకున్న వారికి బ్యాంక్ వారు బీమా ప్రీమియం చెల్లిస్తారని రుణం తీసుకోని రైతులు తమ ఆధా ర్ కార్డు, పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, పంట ధృవపత్రాన్ని తీసుకుని ఆగస్టు 15వ తేదీ లోపు ప్రీమియం చెల్లించుకో వాలన్నారు. ఈయన వెంట ఏఈ

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

రూ.73 కోట్ల ధాన్యం గోల్‌మాల్

| 🌐 Telugu | 📍 Suryapet, తెలంగాణ

సూర్యాపేట జిల్లా బాలెంలలోని వజ్ర రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు జరిపిన తనిఖీలలో రూ.73 కోట్ల విలువైన 29,188 టన్నుల ధాన్యం మాయమైనట్లు తేలింది. ఎఫ్‌సీఐకి చేరాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై TRP పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి, మిల్లులోని నిల్వలను సీజ్ చేశారు.

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు: సీఈఓ

| 🌐 Telugu | 📍 Amaravathi, AP, ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను రాష్ట్ర సీఈఓ వివేక్ యాదవ్ అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,16,27,694గా నమోదైంది. అయితే ఇందులో అడ్రస్ లేని వారు 44,89,488 మంది, మరణించిన వారు 15,22,174 మంది, ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారు 14,43,886 మంది ఉన్నట్లు సీఈఓ వెల్లడించారు. అలాగే కొత్తగా 7,37,216 మంది ఓటర్లు నమోదయ్యారు.

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

సహోద్యోగిని అతి కిరాతకంగా పొడిచి చంపిన యువకుడు!

| 🌐 Telugu | 📍 UP, UP, ఉత్తర ప్రదేశ్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో, ప్రియురాలితో చనువుగా ఉంటున్నాడనే కక్షతో ఓ యువకుడు తన సహోద్యోగిని కత్తితో పొడిచి హత్య చేశాడు. బరేలీకి చెందిన సురేశ్, అదే కంపెనీలో పనిచేస్తున్న బాబీతో గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నరేశ్ మధ్య వివాదం ముదరడంతో ఈ ఘోరం జరిగింది. బాబీతో సురేశ్ ఎక్కువగా మాట్లాడటం సహించలేకపోయిన నరేశ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తొలి ఏకాదశి ఏర్పాట్లు పై అధికారులసమావేశం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

తొలి ఏకాదశి ఏర్పాట్లు పై అధికారులసమావేశం

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): సత్ర శాలలోని శ్రీగంగాభ్రమరాంబ సమేత మల్లిఖార్జు నస్వామి సన్నిధిలో ఈ నెల 25న నిర్వహించ నున్న తొలి ఏకాదశి ఏర్పాట్లపై అధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ జీవీ శివయ్య అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది. సమావేశంలో తహసీల్దార్ మర్రి దీప్తి, రామిరెడ్డి, ఎస్ఐ సీహెచ్ నాగార్జున, డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి , ఏఈలు వెంకటేష్, మస్తాన్ వలి పాల్గొన్నారు

కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

కోవిడ్.పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోలి పీహెచ్ సీ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి హెచ్చరించారు బుధవారం ఏఎన్ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందు ప్రజలుజాగ్రత్తగా మాస్క్ లు దరించాలన్నారురాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యం లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. చేతులు పరిశుభ్రత, శ్వాసకోశ పద్ధతులను పాటిస్తూ అనుమానాస్పద వ్యక్తులు కన్పిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో వున్నాయన్నారు. 3129 మార్చి 22 నుంచి కరోనా విజ్బంట్ స్తుండడంతో

గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు వేగవంతం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు వేగవంతం

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

: జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా రూ.8 కోట్లతో 11 గ్రామాల్లో రక్షిత మంచినీటి ట్యాంక్ ల నిర్మాణం ప్రారభమైనట్లు ఆర్డబ్ల్యుఎస్ ఏఈ వెన్ను వెంకటేష్ చెప్పారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ ఓక్కో ఓవర్ హెడ్ ట్యాంక్ 40 వేల లీటర్ల స్థాయి నుంచి 2.50 లక్షల లీటర్ల సామర్థ్యంగల ట్యాం క్ నిర్మాణం జరుగుతుందన్నారు. రెంటచింతలకు 2, తుమృకోట 2, మంచికల్లు 2,రెంటాల 1, కొత్తగంగరాజు పల్లె 1,పాలువాయి 1,కొత్త పాలువాయి 1, పాలువాయిగేట్ 1, మిట్టగుడిపాడు 1, గోలి 1, మల్లవరం 1,పశర్లపాడు 1 మొత్తం 15 ట్యాంక్

‘తల్లికి వందనం’ నిధుల విడుదల
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

‘తల్లికి వందనం’ నిధుల విడుదల

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లికి వందనం’ పథకం రెండో ఏడాది నిధుల విడుదల ప్రక్రియ ఘనంగా ప్రారంభమైంది. చదువు పేద కుటుంబాలకు భారం కాకూడదనే ఆశయంతో ప్రభుత్వం తొలి విడత కింద 64.76 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.15,000 కేటాయించగా, పాఠశాలల నిర్వహణ నిధి కింద రూ.2,000 మినహాయించి మిగిలిన రూ.13,000 నగదును తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ పథకం వర్తింపజేస్తుండటంతో గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు లబ్ధి చేకూరుతోంది. కొత్తగా చేరిన విద

వ్యవసాయ శాఖ ఏడీఏకి సమ్మె నోటీసు అందిస్తున్న ఎంపీఈవోలు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

వ్యవసాయ శాఖ ఏడీఏకి సమ్మె నోటీసు అందిస్తున్న ఎంపీఈవోలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

జీతాలు పెంచాలని, శాశ్వితంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులివ్వాలని, ప్రమాద బీమా క ల్పించాలని, మహిళా ఉద్యోగినులకు చైల్డ్ కేర్ లీప్స్ మంజూరు చేయాలని కోరుతూ మల్టీపర్పస్ ఎక్స్టెటెన్షన్ ఆఫీసర్లు మంగళవారం నుంచి పెన్ డౌ న్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ మేరకు మాచర్ల ఏడీఏ జగదీశ్వరరెడ్డికి రాతపూర్వకంగా అభ్యర్ధనను అందించారు. ఈసందర్భంగా యూనియన్ నేత ఆ నిల్ మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి చాలీ చాలని వేతనంతో బాధ్యతలు నిర్వహిస్తున్నామని అయినా తమ జీవితాల్లో ఎలాంటి పురోగతి లే దని వేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

మంత్రాలయం: కారు ప్రమాదంలో వ్యక్తి మృతి!

| 🌐 Telugu | 📍 Kurnool, ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం కుటుంబంతో కలిసి బయలుదేరిన రవిశెట్టి (43) అనే వ్యక్తి ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. బాధితులు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును అత్యంత వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో రవిశెట్టి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అ

చెప్పుతో కొట్టి బ్రేకప్? అనుపమ - ధ్రువ్ లవ్ స్టోరీకి ఘోరమైన ఎండ్!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

చెప్పుతో కొట్టి బ్రేకప్? అనుపమ - ధ్రువ్ లవ్ స్టోరీకి ఘోరమైన ఎండ్!

| 🌐 Telugu | 📍 ఢిల్లీ

నటి అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ గత మూడేళ్లుగా రహస్య ప్రేమాయణం నడిపి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల నడుమ, ధ్రువ్ వైఖరి నచ్చక వారిద్దరి మధ్య తీవ్ర వివాదం తలెత్తి హఠాత్తుగా విడిపోయారనే ప్రచారం కోలీవుడ్, టాలీవుడ్‌లలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది; చివరిసారిగా కలుసుకున్న సమయంలో జరిగిన తీవ్ర వాగ్వాదంలో అనుపమ కోపంతో ధ్రువ్‌ను చెప్పుతో కొట్టి మరీ బ్రేకప్ చెప్పేసిందనే రూమర్ నెట్టింట క్షణాల్లో వైరల్ అవ్వడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతుండగా, ఈ ఘోరమైన బ్రేకప్ డ్రామాపై ఇప్పటివరకు ఇరు వర్గాల న