
ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం.. 359 ఉద్యోగాల కల్పన
ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తాజాగా 25 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ శాఖల్లో ఇప్పటివరకు 359 ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. ప్రత్యేక కేసుల కింద మరో 35 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బంది భద్రతకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు.